మా లక్ష్యం
ధార్మిక గ్రంథాలు ప్రతి ఇంటిలోనూ ఉండాలనేది మా లక్ష్యం (ప్రతి మనిషి వద్ద).
ఒక శతాబ్దానికి పైగా, మా పవిత్ర గ్రంథాల ద్వారా తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక కాంతిని పంచుతున్నాము.
Founded with a passion for knowledge, Challa Publications has grown to become a leading publisher...
చల్లా పబ్లికేషన్స్ ప్రస్థానం 1909లో మచిలీపట్నంలోని శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి గారిచే స్థాపించడం మొదలైంది. తాళపత్ర గ్రంథాల రాతప్రతులు పండితులకు మాత్రమే పరిమితమైన ఆ కాలంలో, వేదాలు మరియు పురాణాల జ్ఞానాన్ని ప్రతి తెలుగు ఇంటికీ చేర్చాలనే దృష్టితో మా ఈ ప్రయాణం మొదలైంది.
నేడు, మా మాతృ సంస్థ కృష్ణా ఏజెన్సీస్ మరియు విజయవాడలోని ఎస్ఎల్ఎన్ ప్రెస్ ద్వారా మేము ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే, సాంకేతికత ద్వారా ఈనాటి తరానికి కూడా ఆ పవిత్ర గ్రంథాలను మరింత చేరువ చేస్తున్నాము.
ఒకే కుటుంబం, ఒకే సంకల్పం — తెలుగు గ్రంథాలను తరతరాలుగా భద్రపరుస్తూ నేటి డిజిటల్ యుగం వరకు.
మచిలీపట్నంలో చల్లా ప్రెస్ స్థాపించి, తొలి తెలుగు పవిత్ర గ్రంథాలను ముద్రించారు.
అన్ని రకాల పుస్తకాలను ప్రచురించి, ప్రతి జిల్లాకు చేర్చారు.
తెలుగు రాష్ట్రాలకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పంపిణీని విస్తరించారు.
కుటుంబ వారసత్వాన్ని ఆన్లైన్లోకి తెచ్చి, కొత్త తరం పాఠకులకు అందిస్తున్నారు.
ధార్మిక గ్రంథాలు ప్రతి ఇంటిలోనూ ఉండాలనేది మా లక్ష్యం (ప్రతి మనిషి వద్ద).
పురాతన గ్రంథములను కాపాడి భావి తరాలకు అందించాలనేది మా విన్నపము.
"పుస్తకమే గురువు — జ్ఞానమే వెలుగు"
తరతరాల నుంచి ధర్మం కోసం నిలబడి భావితరాలను కూడా మాతో కలిపి నడిపించటం.
జ్ఞానంతోనే మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దటమే మా పుస్తకాల గమ్యం.
మా పూర్వీకులు వ్రాసిన ప్రతి గ్రంథమును దాని విలువను, గ్రంథావశ్యకత గురించి అందరికీ తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము.
"సత్యమేవ జయతే" అనేది మా పుస్తకాల సారాంశము. అదే మా సిద్ధాంతము.
విలువలతో కూడిన నవ సమాజ స్థాపనకు యువత నడుంబిగించి గ్రంథాలయాలను పునరుద్ధరణ చేయాలనేది మా అభ్యర్థన.
1909వ సం॥లో స్థాపించిన మా సంస్థ (అప్పటినుండి ఇప్పటి వరకు) గ్రంథములను ప్రచురించటంలో మా నిబద్ధత చెక్కుచెదరలేదు.
మిడిమిడి జ్ఞానముతో కొందరు వ్రాస్తున్న గ్రంథముల భావజాలంతో సమాజంలో అశాంతి పెరిగిపోతోంది. దీనిని పూర్తి స్థాయిలో పారద్రోలి ప్రతి ఒక్కరిలో సరైన జ్ఞానాన్ని అందించటం. పురాతన జ్ఞానం ద్వారానే సమాజంలో శాంతి నెలకొల్పాలనేది మా ఆకాంక్ష.
మూల గ్రంథములలో ఎటువంటి మార్పులు చేయకుండా ప్రచురించటమే మా నిజాయితీ.
కాలగర్భంలో కలసిపోతున్న సనాతన, సంప్రదాయ గ్రంథములను కాపాడాలనేది మా ఆరాటం.
ఆధునికతలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పురాతన గ్రంథాల గురించి తెలుసుకోవాలనేదే మా అభిరుచి.
జ్ఞానాభిలాషతోనే మా సంస్థ 1909లో స్థాపించబడినది. అదే అభిలాషతో మేము ఇప్పటికీ ఈ నవ సమాజానికి మా గ్రంథములను చేరవేయటమే మా అభిలాష.
1909 సం॥ నుండి సాగుతున్న మా ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా మా గ్రంథ ముద్రణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలి అనేదే మా కోరిక.
"పుస్తకమే దైవము ; జ్ఞానమే మోక్షము" అనే ఆశయములతో మా సంస్థ నడుపబడుతోంది.
అందుకే మా సంస్థ 1909వ సంవత్సరం నుండి నేటి వరకు అత్యుత్తమ విలువలతో నిలబడి చక్కటి ఆశయముతో కొనసాగుతున్నామని తెలియపరుచుచున్నాము.
అందువలనే కోట్లాది మంది హృదయాలలో మా పుస్తకాలకు మహోన్నత స్థానం ఏర్పడినందుకు మా తరుపున మీ అందరికి 🙏🙏🙏.
అన్ని సంప్రదాయాలకు చెందిన అత్యుత్తమ తెలుగు గ్రంథములు.
115+ ఏళ్లుగా తెలుగు ఆధ్యాత్మిక సమాజానికి నిబద్ధతతో సేవ.
ప్రతి ప్రచురణ సంస్కృత, తెలుగు మూల గ్రంథాలతో పోల్చి ఖచ్చితత్వం కోసం పరిశీలించబడుతుంది.
యాసిడ్-రహిత కాగితంతో సాంప్రదాయ హార్డ్కవర్ బైండింగ్ — తరతరాలు మన్నేలా.
పవిత్ర గ్రంథాల రక్షణ కోసం త్రి-పొర ప్యాకేజింగ్తో ప్రపంచవ్యాప్తంగా డెలివరీ.
వాట్సాప్, ఇమెయిల్, ఫోన్ ద్వారా తక్షణ సహాయం — సరైన గ్రంథాల ఎంపికపై సూచనలు.
వేదాల నుండి భక్తి గీతాల వరకు 500+ ప్రామాణిక తెలుగు ఆధ్యాత్మిక గ్రంథాలను అన్వేషించండి.
సేకరణను చూడండి
సఫారీలో రెండు ట్యాప్లు — చల్లా బుక్స్ మీ ఇతర యాప్ల పక్కన ఉంటుంది.